హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైపోల్స్‌పై దృష్టి సారించిన బొత్స, తెలంగాణపై మాట్లాడ్తా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉప ఎన్నికలపై దృష్టి సారించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతల రాజీనామాతో పదిహేడు నియోజకవర్గాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానం కూడా త్వరలో ఖాళీ కానుంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఇటీవల జరిగిన తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో జరిగిన కొవూరుకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. దీంతో బొత్స రానున్న ఉప ఎన్నికలకు ముందుగానే పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంపై సోమవారం దృష్టి సారించారు.

మంత్రులు ధర్మాన ప్రసాద రావు, పార్థసారథి, కొండ్రు మురళితో ఆయన భేటీ అయ్యారు. నరసన్నపేట నియోజకవర్గంపై వారితో చర్చించారు. ఆ తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోనూ బొత్స భేటీ అయ్యారు. ఏప్రిల్ 12, 13వ తారీఖున బొత్స ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కాగా అనంతరం ఆయనను మీడియా పలకరించింది. పార్టీ నేతలు డిఎల్ రవీంద్రా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలకు బహిరంగంగా మాట్లాడవద్దని తాను సూచించానని బొత్స చెప్పారు. తెలంగాణపై తాను అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. తెలంగాణ కోసం బలిదానాలు వద్దన్నారు. త్వరలో తేలుతుందన్నారు. పార్టీలో కాంగ్రెస్, పిఆర్పీ అన్న తేడా లేదన్నారు. మంత్రి సి.రామచంద్రయ్యను పిలిచి మాట్లాడతానన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం వల్లనే తాము ఓడిపోయామన్నారు. 4న శ్రీకాకుళం, 5న పాయకరావుపేట, 6న తిరుపతి పర్యటిస్తానని చెప్పారు.

English summary
PCC chief Botsa Satyanarayana concentrated on next bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X