ఢిల్లీలో సిబిఐ జెడి: జగన్ను విచారణకు పిలుస్తారా?

ఏప్రిల్ 2 తేదిలోగా ఛార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ లోపే అంటే మార్చి 30వ తారీఖున సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమౌతోందని అంటున్నారు. ఆ లోగా జగన్ను విచారణకు పిలవాలా లేక విచారించకుండానే ఛార్జీషీట్ దాఖలు చేయాలా అనే అంశంపై నేటి లక్ష్మీ నారాయణ, ఎపి సింగ్ సమావేశంలో తేలే అవకాశముందని అంటున్నారు. ఛార్జీషీట్లోనూ జగన్ పేరు ఉంటుందా లేదా అనే విషయం పైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఛార్జీషీట్కు కోర్టు గడువు సమీపిస్తుండటంతో అందరిలోనూ జగన్ కేసులో ఏమవుతుందోననే ఉత్కంఠ ప్రారంభమైంది. ఈ కేసులో దాదాపు విచారణ పూర్తయింది. కాగా ప్రస్తుతం జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్నారు.












Click it and Unblock the Notifications