బాబు చంద్రగిరి నుండి పారిపోయారు: జగన్ పార్టీ నేత

చంద్రగిరి ప్రజలు తరిమేస్తే చంద్రబాబు కుప్పం చేరుకున్నారన్నారు. ఓటమికి భయపడే చంద్రగిరి నుండి పారిపోయారన్నారు. చంద్రబాబు నిత్యం తాను ఆస్తులు ప్రకటించానని చెప్పుకుంటున్నారని, ఆసలు ఆయన ప్రకటించిన ఆస్తులు నిజమేనా అని ప్రశ్నించారు. ప్రకటించిన ఆస్తులు నిజమే అయితే తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ పైన స్టే ఎందుకు తెచ్చుకున్నావన్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే నీ ఆస్తులపై విచారణకు సిద్ధపడాలని బాబుకు సవాల్ విసిరారు. బాబు పెద్ద అబద్దాల కోరు అన్నారు. మనుషుల్నే శవాల్ని చేసి రాజకీయాలు చేసే చరిత్ర బాబుది అన్నారు.












Click it and Unblock the Notifications