లిమ్కాబుక్లో గల్లాకు చోటు,జయదేవ్ సిద్ధమన్న మంత్రి
అయితే ఈ గుర్తింపు తన కుమారుడు జయదేవ్కే దక్కుతుందని, ఆయనే ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చూసుకున్నారని మంత్రి అరుణ అవార్డు అందుకున్న సందర్భంగా తెలిపారు. కేంద్ర మంత్రి పళ్లం రాజు ఆమెను అభినందించారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి తన కుమారుడు జయదేవ్ సిద్ధంగా ఉన్నాడని అరుణ తెలిపారు. అయితే సీటు కోసం తాను ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అందుకోసం ఎవరినీ కలవలేదని ఆమె తెలిపారు. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తే వారిని గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉగాది వేడుకల్లో పాల్గొనడానికి, లిమ్కా రికార్డు అందుకోవడానికే తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. తిరుపతిలో పోటీ తీవ్రంగా ఉంటుందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ చంద్రగిరి కంటే తీవ్రమైన పోటీ ఉండే నియోజకవర్గం మరేదీ ఉండబోదన్నారు. తిరుపతిలో అభ్యర్థి తన కొడుకైనా మరెవరైనా కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 40 వేల మెజారిటీ దక్కడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానానికి, చిరంజీవికి, ముఖ్యమంత్రికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి ఎవరు పోటీ చేసినా గెలిపిస్తామన్నారు.