వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోకసభను నడవనివ్వం, ప్రధాని ఉన్నాడా: కెసిఆర్
గుండెలు అవిసేలా అరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని ఆయన అన్నారు. అత్మహత్యలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఇదే వైఖరి కొనసాగితే అసహజ పరిణామాలకు దారి తీస్తుందని ఆయన అన్నారు. చేతులు జోడించి యువతకు విజ్ఝప్తి చేస్తున్నానని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ వచ్చే వరకు పోరాడుదామని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు గొడవలు లేవు, హింస లేదు, ఉప ఎన్నికలు కూడా జరిగాయని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఇది ప్రశాంత వాతావరణం కాదా అని ఆయన అన్నారు. తెలంగాణపై స్పందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు.
Comments
k chandrasekhar rao telangana rastra samithi telangana new delhi కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ న్యూఢల్లీ
English summary
TRS president K Chandrasekhar Rao said that his party will continue to stall Loksabha prosedings.
Story first published: Monday, March 26, 2012, 15:15 [IST]