జగన్పై చంద్రబాబుకు ఎందుకంత కోపం వచ్చింది?

త్వరలో రానున్న ఉప ఎన్నికల కోసం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మధ్య ఎప్పుడో లోపాయికారి ఒప్పందం కుదిరిందని జగన్ ఆరోపించారు. ప్రత్తిపాడు, ఎమ్మిగనూరు, పాయకరావుపేట, అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాలను చంద్రబాబు నాయుడికి వదిలేసి వాటిలో కాంగ్రెసు పార్టీ బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపేలా ఒప్పందం కుదిరిందని ఆయన అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు డబ్బును వెదజల్లి, ప్రజల ఆప్యాయతను, అనురాగాన్ని, ఆత్మగౌరవాన్ని వేలం వేసి కొనేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబుతో కాంగ్రెసు నాయకులు కమ్మక్కయ్యారని చెప్పడానికి కొన్ని ఉదంతాలను ఆయన చెప్పుకొచ్చారు. రెండు ఎకరాల భూమి కలిగిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్లు సంపాదించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications