చిరంజీవికి సోనియా వద్ద పలుకుబడి ఉంది: సిఆర్సీ

కాంగ్రెసును భవిష్యత్తులో మేమే ముందుండి నడిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద పలుకుబడి ఉందన్నారు. చిరంజీవిని సోనియా గౌరవంగా చూస్తున్నారన్నారు. చిరంజీవికి కేంద్రమంత్రి పదవి దక్కడం ఖాయమన్నారు. అయితే ఆయనకు కేబినెట్ హోదా వస్తుందో లేక సహాయ హోదా వస్తుందో మాత్రం తెలియదన్నారు. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కాగా ఆదివారం ఆయన కాంగ్రెసు పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications