రూ. 14 కోట్లు లంచం ఇవ్వ జూపారు: వికె సింగ్ ఆరోపణ

అప్పటికే సుమారు 600 వాహనాలను కొనుగోలు చేసినట్టు ఆ మధ్యవర్తి తనకు చెప్పగా, ఈ విషయాన్ని తానే స్వయంగా రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్టు చెప్పారు. దీనిపై విచారణ కూడా జరుగుతోందని వీకే సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ అంశం పార్లమెంట్ ఉభయ సభలను సోమవారం కుదిపేశాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి వీకే సింగ్ ఆరోపణలపై చర్చించాలని ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అడ్డు తగిలింది. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications