టిడిపిలో తెలంగాణ చిచ్చు: చంద్రబాబుపై ఒత్తిళ్లు?

తెలంగాణ నేతల వాదనతో సీమాంధ్ర నేతలూ ఏకీభవిస్తున్నారని అంటున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాము అడ్డుకోమని బాబు కేంద్రానికి లేఖ రాస్తే తెలంగాణలో టిడిపి బలపడుతుందని తద్వారా సీమాంధ్రలోనూ పార్టీకి లబ్ధి చేకూరుతుందని వారు భావిస్తున్నారట. అయితే ఇదే విషయాన్ని బాబు వద్ద ప్రస్తావించేందుకు ముందుకు రావడం లేదట. బాబు లేఖ రాస్తే తెలంగాణ భారం కేంద్రం పైనే పడుతుందని వారు భావిస్తున్నారట. అప్పుడు టిఆర్ఎస్, బిజెపిలకు తమను ప్రశ్నించలేదని వారు భావిస్తున్నారట. ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇచ్చినా లేఖ రాసినందు వల్ల తెలంగాణలో టిడిపి బలపడి ఇటు సీమాంధ్ర అటు తెలంగాణలో టిడిపి ఆధ్వర్యంలోనే ప్రభుత్వాలు ఏర్పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు రెండో దశ ఉప ఎన్నికల తర్వాత ఈ విషయంపై ఆలోచించుదామని మరికొందరు నేతలు సూచిస్తున్నారట.
కాగా ఇప్పటికే వేణుగోపాల చారి, హరీశ్వర్ రెడ్డి పార్టీ వీడేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బాబు లేఖ రాయకుంటే మరికొందరు నేతలు పార్టీని వీడే అవకాశముందని తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నారట. మరోవైపు పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఫోరం కన్వీనర్ పదవికి మూడు రోజుల క్రితం రాజీనామా చేయగా దానిని బాబు తిరస్కరించారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఫోరం కన్వీనర్ పదవితో పాటు శాసనసభ్యత్వానికి, పార్టీకి కూడా రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎర్రబెల్లి మాత్రం రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications