హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దోషులు బయట ఉన్నారు, కుట్ర చేయలేదు: ఆచార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో దోషులు బయట తిరుగుతున్నారని ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య అన్నారు. హైకోర్టు తన బెయిల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ఆయన బుధవారం కోర్టు ముందు లొంగిపోయారు. ఎమ్మార్ వ్యవహారంలో తాను కుట్ర చేయలేదని ఆయన చెప్పారు. అవినీతికి, అక్రమాలకు పాల్పడినవారు బయట తిరుగుతున్నారని, వారి వివరాలు త్వరలో బయటకు వస్తాయని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆయన అన్నారు.

ఎమ్మార్ విషయంలో ప్రభుత్వ వాటా ఇప్పటికీ సరిగానే ఉందని ఆయన చెప్పారు. తనను కావాలనే కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని, కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్ారు. తన సర్వీసులో ఎప్పుడూ లంచం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ బెయిల్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేస్తూ వెంటనే లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది.

English summary
BP Acharya, accused in EMAAR scam case, pleaded his innocence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X