లోకసభలో తెలంగాణ లొల్లి: ఎంపీలకు సుష్మా మద్దతు

అ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. అయితే ఎంపీలు మాత్రం మళ్లీ తెలంగాణ కోసం పట్టుబట్టారు. కాంగ్రెసు పార్టీ ఎంపీలు వెల్లోకి దూసుకు పోయారు. ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ తొలిసారి వెల్లోకి దూసుకు పోయారు. తెలంగాణపై తేల్చాలని పట్టుబట్టారు. భారతీయ జనతా పార్టీ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రాంత ఎంపీలకు మద్దతుగా నిలిచారు. వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఒక్కో ఎంపీకి మాట్లాడేందుకు ఐదు నిమిషాల సమయం కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ మరోసారి సభను రెండు గంటలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications