వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వైయస్ వివేకానంద'కు మద్దతు పలికిన మైసూరారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekanada Reddy - Mysoora Reddy
న్యూఢిల్లీ: రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి చేస్తున్న దీక్షకు తెలుగుదేశం పార్టీ నేత ఎంవి మైసూరా రెడ్డి గురువారం తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మైసూరా రెడ్డి మాట్లాడారు. రాయలసీమ వెనుకబడిందని శ్రీకృష్ణ కమిటీ నివేదిక తేల్చిందన్నారు. వెంటనే కేంద్రం శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీమ వెనుకబాటుతనంపై ప్రత్యేక ఉద్యమం చేపట్టాల్సి ఉందన్నారు. రాయలసీమలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.

తెలుగు గంగ, గాలేరు తదితర ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసిన తర్వాత తాము తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సీమ రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతమన్నారు. దీని అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కాగా సీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలంటూ ఆ ప్రాంత విద్యార్థులు న్యూఢిల్లీలో రెండు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా వైయస్ వివేకా కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈయన దీక్షకు మైసూరాతో పాటు ఎస్పీవై రెడ్డి మద్దతు పలికారు.

English summary
TDP leader MV Mysoora Reddy supported Congress leader YS Vivekananda Reddy deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X