హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగే గావుకేకలు పెట్టినట్లు ఉంది: జగన్‌పై తులసి రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tulasi Reddy
హైదరాబాద్: దొంగతనం చేసిన వ్యక్తే దొంగా దొంగా అని గావుకేకలు పెట్టినట్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందని కాంగ్రెస్ పార్టీ నేత తులసి రెడ్డి బుధవారం విమర్శించారు. ఏ ఎండగు ఆ గొడుగు పట్టే నైజం కలిగిన పచ్చి రాజకీయ అవకాశవాది జగన్ అని మండిపడ్డారు. ఉప్పు, నిప్పు కుమ్మక్కయ్యాయనడం ఎంత హాస్యాస్పదమో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయనడం అంతే హాస్యాస్పదమన్నారు. జగన్ ఇతరులను నిందించడం విడ్డూరమన్నారు.

లోకసభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల చేతిలోని సమైక్యవాద ప్లకార్డులు అడిగి తీసుకొని జగన్ ప్రదర్శించారని ఆరోపించారు. అది కుమ్మక్కు కాదా అని ప్రశ్నించారు. అలా కాకుంటే అది ఏమైనా జగన్నాటకా అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామని టిడిపిని కోరి మరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టించి ఆ పార్టీకి మద్దతిచ్చింది ఎవరన్నారు. అది కుమ్మక్కు కాదా అన్నారు.

English summary

 Congress leader Tulasi Reddy blamed YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X