ఎమ్మార్ కేసు: విజయసాయి భార్యను ప్రశ్నించిన సిబిఐ

అదే సంవత్సరం అక్టోబర్లో బెంగళూరు ఏఎస్ఆర్ కన్ట్రక్షన్ నుండి రూ.57.72 లక్షలతో ఫ్లాట్ కొన్నామని, 2010 ఆగస్టులో చంద్రగిరిలో రూ.48.30 లక్షల విలువైన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి కొన్నామని, అదే సంవత్సరం డిసెంబరులో శంషాబాదులో రూ.1.50 కోట్ల విలువైన ఐదెకరాల స్థలం కొన్నట్లు సునంద రెడ్డి తెలిపారని తెలుస్తోంది. చెన్నై గోపాలపురంలోని ఇంటిని కూతురు నేహా పేరిట కొనుగోలు చేశామని, 2002-03లో చెన్నైలో వాణిజ్య భవనం కొని అద్దెకిచ్చామని, బెంగళూరు ఔటర్ రింగ్ వద్ద ఆదర్శ్ డెవలపర్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉందని ఆమె సిబిఐ ఎదుట చెప్పారని తెలుస్తోంది.
కాగా జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎదుట గురువారం జగతి పబ్లికేషన్ ప్రతినిధులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు ఎమ్మార్ కేసులో నిందితుడు బిపి ఆచార్య నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆచార్యకు శుక్రవారం వరకు రిమాండ్ విధించింది. ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని ఆదేశించింది. అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications