వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో తెలంగాణం: వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: లోకసభలో నాలుగో రోజు తెలంగాణ నినాదాలు వినిపించాయి. గురువారం ఉదయం సభ ప్రారంభమయ్యాకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు సభలో జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణకు అనుకూలంగా సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణపై వెంటనే బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఓ సమయంలో స్పీకర్ వెల్‌లోకి దూసుకు పోయారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో ఆర్మీ చీఫ్ వికె సింగ్ అంశం దుమారం రేపింది. దీంతో చైర్మన్ పావుగంట పాటు సభను వాయిదా వేశారు. పార్లమెంటులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ప్రాంత ఎంపీలు ఆందోళన చేస్తున్నారు.

కాగా నాలుగు రోజులుగా లోకసభలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కె చంద్రశేఖర రావు, విజయశాంతికి కాంగ్రెస్ ఎంపీలు కూడా జత కలుస్తున్నారు. బిజెపి వారికి అండగా నిలుస్తోంది.

English summary
Telangana slogans in Lok Sabha on fourth day also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X