వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ను ఆలింగనం చేసుకున్న ఆజాద్, సభ వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్లమెంటులో ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఆజాద్‌ను కెసిఆర్ పలకరించారు. ఆజాద్ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ముఖాముఖి కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం కెసిఆర్ కేంద్రమంత్రి నారాయణ స్వామిని కలిశారు. కాగా తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఐదో రోజు కూడా తెలంగాణ కోసం లోకసభలో పట్టుబట్టారు. తెలంగాణపై వెంటనే తేల్చాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. జోరుగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. టిఆర్ఎస్, టిటిడిపి ఎంపీలు వెల్‌లోకి దూసుకు పోయారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను పన్నెండు గంటలకు వాయిదా వేశారు.

కాగా సభ వాయిదా పడిన అనంతరం ఎంపీలు పార్లమెంటు మెయిన్ గేట్ వద్ద ధర్నా చేశారు. తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని పట్టుబట్టారు. వారికి బిజెపి అగ్రనేత రాజ్ నాథ్ సింగ్, ఆర్జెడి నేత లలూ ప్రసాద్ యాదవ్ మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో గులాం నబీ ఆజాద్ పన్నెండు గంటలకు భేటీ కానున్నారని తెలుస్తోంది. తెలంగాణపై ఆందోళన చేయవద్దని వారికి సూచించే అవకాశముంది.

English summary
Central Minister Ghulam Nabi Azad hugged TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X