హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పశు ప్రదర్శన: గోమూత్రం ధర లీటరకు రూ. 140

By Pratap
|
Google Oneindia TeluguNews

 Cow urine sold for Rs 140 per litre |
హైదరాబాద్: దేశీ గోవుల ఉత్సవం ఆవుల మూత్రం లీటరుకు 140 రూపాయల చొప్పున అమ్ముడైంది. అవు మూత్రంలో ఔషధ లక్షణాలుంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. దీంతో దాని ధర అంతగా పలికినట్లు చెబుతున్నారు. గురువారం గోవుల ఉత్సవంలో పుంగనూరు పశువులు ఆకర్షణగా నిలిచాయి. అంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన జాతి ఇది. అత్యంత పొట్టివైన ఈ పశువులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

పుంగనూరు గోవులు కేవలం 2.65 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. రోజుకు 3 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర 15 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. గోవుల ప్రదర్శనను రోజుకు ఆరు వేల మంది దాకా సందర్శిస్తున్నట్లు చెబుతున్నారు. కపిల, ఒంగోలు గిత్తలు కూడా సందర్సకులను ఆకట్టుకుంటున్నాయి. దేశీ జాతుల పాల ప్రాముఖ్యాన్ని తెలియజేయడానికి డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, చరక డెయిరీ సంయుక్తంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి.

ఆయుర్వేద వైద్యుల ప్రకారం - గోమూత్రంలో మూత్ర పిండాలను, రక్తనాళాలను శుద్ధి చేసే ఔషధ గుణాలుంటాయి. ఎర్ర రక్తకణాలను, హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణ ప్రక్రియను పెంచుతాయి. అయితే, వైద్యుల సలహా మేరకు గోమూత్రను తగిన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.

English summary
Cow urine, said to contain medicinal properties, is being sold at around Rs 140 per litre at the Desi Cow Utsav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X