వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాతో పురంధేశ్వరి, మేడం వద్దకు రాష్ట్ర నేతల క్యూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari-Sonia Gandhi
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తన భర్త, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో సహా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని గురువారం కలుసుకున్నారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు దగ్గుపాటి చెప్పారు. కాగా గురువారం సోనియా వద్దకు రాష్ట్రానికి చెందిన నేతలు క్యూ కట్టారు. పురంధేశ్వరి దంపతులతో పాటు వేరు వేరుగా రాజ్యసభకు ఎంపికైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎంపీలు రాజయ్య, బలరాం నాయక్ ఆమెను కలుసుకున్నారు. పురంధేశ్వరితో పాటు సోనియాను కలిసిన వెంకటేశ్వర రావు తాను రాసిన మూడు పుస్తకాలు ఆమెకు అందజేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న అధినేత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని దగ్గుపాటి దంపతులు మీడియాతో చెప్పారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు పాల్వాయి చెప్పారు.

బలరాం నాయక్, రాజయ్యలు తెలంగాణ సమస్య, కంతానాపల్లి సాగునీటి ప్రాజెక్టు నిలుపుదల గురించి అధినేత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. తెలంగాణ జనాభాలో దాదాపు 20 శాతం వరకు గల లంబాడాలకు విద్య, ఉద్యోగావకాశాలు, రాజకీయంగా అన్యాయం జరుగుతున్నందునే అసంతృప్తి పెరిగిందని సోనియాకు వివరించినట్లు బలరాం తెలిపారు. కంతనాపల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే 50శాతం తెలంగాణ బాగుపడుతుందని వివరించినట్లు చెప్పారు. అన్ని వర్గాల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు ఆగవని చెప్పానని అన్నారు. మరో ఎంపి రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నిక జరిగిన తీరును వివరించినట్లు చెప్పారు. కంతనాపల్లి ప్రాజెక్టు పక్కన పెట్టవద్దని చెప్పానన్నారు.

English summary
Minister Purandeswari met AICC president Sonia Gandhi with her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X