హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు రోడ్డు ప్రమాదంలో కర్ణాటకవాసులు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chittoor Map
హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం రోడ్లు నెత్తురోడాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసి బస్సు, ఇండికా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మృతులు కర్ణాటకకు చెందిన బెల్గాం జిల్లా తిలక్ తాలూకా విద్యానగర్ గ్రామానికి చెందినవారు. మృతులను ఉదయ్‌నాథ్ గౌడ్ (43), అతని భార్య పూజ (38), కుమారుడు ఆదిత్య (18), కూతురు చిత్ర (5), కారు డ్రైవర్ చంద్రకాంత్ (34)లుగా గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

మరోవైపు, రంగారెడ్డి డిల్లా శామీర్‌పేట మండలం జగ్గంగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థులు ముగ్గురు మరణించారు. మరో వ్యక్తి కూడా మరణించాడు. ఓ ప్రైవేట్ బస్సు బైక్‌లపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందిన పదో తరగతి విద్యార్థులను నవీన్, మధు, మహేష్‌లుగా గుర్తించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలంలో పాఠశాల బస్సు ఢీకొని 19 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

English summary
In a road accident occured in Chittoor district, five Karnataka residents dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X