తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి వర్గం భేటీ: తిరుపతి టికెట్ కోసం ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: పాత ప్రజారాజ్యం తిరుపతి నియోజకవర్గం నాయకులు శనివారం ప్ర్తత్యేకంగా సమావేశమయ్యారు. పాత ప్రజారాజ్యం పార్టీ కార్యకర్గం సభ్యులు సమావేశమై తిరుపతి కాంగ్రెసు టికెట్ తమకే ఇవ్వాలని ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి శానససభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో తిరుపతి స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ఢిల్లీలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వర్గానికి చెందిన నాయకులు సమావేశమే తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు.

స్థానికేతరులకు కాంగ్రెసు టికెట్ ఇవ్వకూడదని, తమకే టికెట్ లభించేలా చూడాలని వారు చిరంజీవిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జయచంద్రా రెడ్డి వంటి నాయకులు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెసు పార్టీ తమను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే, తాము కాంగ్రెసు పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నామని వారంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత ప్రజారాజ్యం శ్రేణులు తెలుగుదేశం పార్టీలోకి, వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్తున్నాయనే ప్రచారం జరుగుతోందని, అది నిజం కాదని, ప్రజారాజ్యం శ్రేణులన్నీ కాంగ్రెసులోని ఉన్నాయని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని అంటున్నారు. చిరంజీవి ఎవరికి తిరుపతి టికెట్ ఇప్పించినా తాము గెలిపించడానికి పనిచేస్తామని వారు చెబుతున్నారు.

English summary
Congress leader Chiranjeevi camp leaders at Tirupathi organised a meeting to pressurise for Congress ticket to contest in bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X