వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ శ్రీరాముని విగ్రహంతో వైభవంగా శోభాయాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

srirama
హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా రాజధాని హైదరాబాదులో శ్రీరామభక్తులు శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో అశేష రామభక్తులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రను దూల్‌పేటలోని రాణి అవంతి బాయి భవనం నుండి ప్రారంభమైంది. భారీ ఎత్తులో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహం ఈ యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు రామభజన చేస్తూ ముందుకు సాగారు. దూల్‌పేట నుండి ప్రారంభమైన ఈ యాత్ర బేగంబజార్, గోషామహాల్, మొజంజాహీ మార్కెట్ నుండి సుల్తాన్ బజార్ మీదుగా గౌలిగూడ రామమందిర్‌కు చేరుకుంటుంది. ఈ యాత్ర గౌలిగూడ చేరుకునే వరకు రాత్రి ఎనిమిది దాటవచ్చు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి కేవలం నగరం, రాష్ట్రంలోని భక్తులే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చారు. ఇందు కోసం రెండు వేల మంది పోలీసులతో ప్రభుత్వం గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూవాహిని సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇరవై వేలకు పైగా భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని తెలుస్తోంది. క్రమంగా యాత్రలో పాల్గొంటున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది.

కాగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి శ్రీకోదండరామాలయం భక్తులతో కిటకిటలాడింది. రాముని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రాష్ట్రంలోని పలు దేవాలయాలు శ్రీరామ కల్యాణ శోభను సంతరించుకున్నాయి. ఆయా దేవాలయాల్లో వైభవంగా కల్యాణం నిర్వహించారు. సీతారాముల కల్యాణం చూసేందుకు దేవాలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీరామ నవమి సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

English summary
VHP organised Sri Rama Shobha Yatra in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X