సిఎంపై 'తిరుపతి' ప్రెజర్: చిరు, గల్లా వర్గం పోటా పోటీ
ఎవరికే వారే మాకు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని సిఎంకు చెప్పారని తెలుస్తోంది. టిక్కెట్ కోసం పోటీ ఉండటంతో.. సిఎం గెలిచే వారికే టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కార్యకర్తలు, నాయకుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కాగా చిరంజీవితో కలిసి కిరణ్ అభ్యర్థి ఎన్నిక గురించి రావడంతో చిరుకు ఆమోదయోగ్యమైన అభ్యర్థినే ఎన్నిక చేయాలని సిఎం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పద్మావతి అతిథి గృహంలో ఆయన తిరుపతి అభ్యర్థిపై కసరత్తు చేశారు.
అంతకుముందు ఆయన డిజిపి దినేష్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. తిరుపతిలో రూ.50 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి, మంత్రి గల్లా అరుణ కుమారి తదితరులు పాల్గొంటారు. కిరణ్ రోజంతా బిజిబిజిగా గడుపుతారు.