జగన్ ఇప్పటి వరకు చెప్పలేదు: మంత్రి దానం నాగేందర్

ప్రారంభంలో పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెసు జెండాతో గెలిచిన జగన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెసు పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ విమర్శలు మానుకోవాలని సూచించారు. తన పార్టీ నేతలకు కూడా దానం నాగేందర్ సూచనలు చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం కాంగ్రెసు పార్టీ నేతలు ఇకనైనా మానుకోవాలని కోరారు. వైయస్ను విమర్శిస్తే పార్టీకే నష్టమన్నారు. వైయస్ను తిడితే కాంగ్రెసు పట్ల ప్రజలకు విశ్వసనీయత పోతుందన్నారు. ఆయనను విమర్శించాలా వద్దా అనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. గాలికి గెలిచిన వాళ్లే వైయస్ను విమర్శిస్తారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మేం విఫలమయ్యామని ఆయన చెప్పారు.
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయానికి జగన్ తూట్లు పొడుస్తున్నారని దానం మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభిప్రాయాలను సేకరించి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications