ఢిల్లీ టు లక్నో: తండ్రి పిస్తోలుతో కాల్చుకున్న కూతురు

ఆమె తండ్రి శ్రీ కృష్ణ సింగ్. బుధవారం ఉదయం 5.30 గంటల నుండి 11.00 గంటల ప్రాంతంలో ఆమె కాల్చుకుంది. అలక్ష్య న్యూఢిల్లీలోని మోజాయీ ఇన్స్టిట్యూట్లో రెండేళ్ల జపనీస్ కోర్స్ నేర్చుకుంటోంది. అయితే డిప్రిషన్ సమస్య కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఫిబ్రవరిలో లక్నోకు తీసుకు వచ్చారు. ఈమెకు డిప్రెషన్కు సంబంధించిన చికిత్స చేయిస్తున్నారు.
చికిత్స చేయిస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఆమె రివాల్వర్తో కాల్చుకున్న స్థలంలో ఆమె సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అలక్ష్య.. డియర్ పేరెంట్స్, మరో దారి లేక నేను వెళ్లి పోతున్నానని, మిమ్మల్ని నేను మరింత బాధించదల్చుకోలేదని, ఈ బాధాకరమైన జీవితం నుండి బయట పడాలనుకుంటున్నానని, దేవుడు తనను పిలుస్తున్నాడని ఆమె తన సూసైడ్లో పేర్కొంది.
అంతేకాకుండా తన మృతికి ఎవరూ కారకులు కారని, తన ఆత్మ శాంతించాలంటే ఎవరినీ తప్పు పట్టవద్దని అలక్ష్య సూసైడ్ నోట్లో కోరింది. చివరలో లవ్ యు మామ్, డాడ్ అని రాసింది. ఆమె సాధారణంగా పదకొండు గంటలకు లేస్తుంది. దీంతో ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులు ఎవరూ ఆమె గదికి వెళ్లలేదు.
పదకొండు గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఆమె గదిలోకి వెళ్లారు. అక్కడ అలక్ష్య విగత జీవిగా పడి ఉండటాన్ని చూశారు. ఆమె తన తండ్రికి చెందిన ఎస్.32 లైసెన్సుడ్ రివాల్వర్తో తలపై కాల్చుకుంది. కాగా మరో ఘటనలో ఇరవయ్యేళ్ల ఆశిష్ కుమార్ అనే యువకుడు బంతారాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ అక్కడ లేదు.












Click it and Unblock the Notifications