ఆజాద్ ఎన్కౌంటర్, పోలీసులకు క్లీన్చిట్పై పున:పరిశీలన
ఐపియస్ అధికారులు హోం మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంటారని, అందువల్ల సిబిఐ విచారణను హోం మంత్రి ప్రభావితం చేసి ఉంటారనే అనుమానం ఉందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. సిబిఐ సమర్పించిన నివేదికలో పలు లొసుగులు ఉన్నాయని, ఎదురుకాల్పులు నిజంగానే జరిగాయని సిబిఐ చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర నిర్ధారణలు హోం మంత్రి ప్రభావంతో జరిగి ఉంటాయనే అనుమానం ఉందని ఆయన అన్నారు.
మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించేందుకు ఆజాద్తో హోం మంత్రి టచ్లో ఉన్నారని, హోం మంత్రి ఆమోదం లేకుండా ఆజాద్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంపి ఉండరని ఆయన వాదించారు. హేమచంద్ర పాండే భార్య వినీతా పాండే తరఫున కోర్టులో వకాల్తా తీసుకున్న ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడానికి తొలుత కొర్టు అనాసక్తి ప్రదర్శించింది. ఆ తర్వాత రాతపూర్వకంగా తమకు సమర్పించాలని సూచించింది.
తాము సిిబఐ దర్యాప్తు నివేదికపై విచారణ జరపడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టు తెలిపింది. సిబిఐ నివేదికను పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు అంగీకరించింది. ఆజాద్, పాండే 2010 జులైలో ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ జిల్లాలో హతమయ్యారు. ఆజాద్ గానీ, పాండే గానీ బూటకపు ఎన్కౌంటర్లో చనిపోలేదని, నిజమైన ఎదురు కాల్పుల్లోనే మరణించారని సిబిఐ నిర్ధారించిందని సుప్రీంకోర్టు మార్చి 16వ తేదీన ప్రకటించింది.