తెలంగాణపై వైయస్ బెదిరించారు: సారయ్య సంచలనం

తాను తెలంగాణ కోసం సభ పెడితే మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటానని వైయస్ తనకు స్వయంగా చెప్పి బెదిరించారన్నారు. తాను ఆయన వ్యాఖ్యలకు లొంగలేదు కాబట్టే తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదని ఆరోపించారు. తాను తెలంగాణ కోసం అప్పుడు ఇప్పుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నాను కాబట్టే పదివేల మందితో మీటింగ్ పెట్టానని చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ బిడ్డల మనోభావాలకు అనుగుణంగానే వైయస్ వద్దని చెప్పినప్పటికీ తాను ఆనాడు సమావేశం పెట్టానని చెప్పారు. కాగా వైయస్ రాజశేఖర రెడ్డిపై పలువురు మంత్రులు ఎదురు దాడి ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.
మొన్న మంత్రి కొండ్రు మురళీ మోహన్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేయగా ఇప్పుడు బస్వరాజు సారయ్య చేశారు. కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంత రావు కూడా ఆయనపై తీవ్రస్థాయిలో మరోసారి విరుచుకు పడ్డారు. కాగా బస్వరాజు సారయ్య దివంగత వైయస్ పైన చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి ఖండించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications