రాజీనామాకు నలుగురు మంత్రులు: సోనియాకు లేఖలు
పార్టీలో భారీ మార్పుల కోసమే వారు రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షణను వాయలార్ రవికి అప్పగించే అవకాశం ఉంది. పార్టీ కోసం పనిచేయడానికి 2008 లోకసభ ఎన్నికలకు ముందు కూడా జైరాం రమేష్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ప్రణాళికను ఆయన రూపొందించారు. 2014 ఎన్నికల విషయంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ నలుగురు మంత్రి పదవులకు దూరమై పూర్తి కాలం పార్టీ కోసం పనిచేసే అవకాశాలున్నాయి. శాసనసభ ఎన్నికల్లో వైఫల్యంపై రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక నేపథ్యంలో పార్టీ పునరుద్దరణకు చర్యులు తీసుకోవాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంటోనీ కమిటీ నుంచి తుది నివేదిక ఏప్రిల్ చివరి నాటికి సోనియాకు అందుతుంది. తెలంగాణ పార్లమెంటు సభ్యులపై సోనియా గాంధీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకసభ కార్యకలాపాలను అడ్డుకోవడంపై ఆమె గుర్రుమంటున్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను కట్టడి చేయడానికి, తెలంగాణ సమస్యను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాయలార్ రవి, ఆజాద్, జైరాం రమేష్లకు ఆంధ్రప్రదేశ్తో మంచి సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక లోకసభ స్థానాలను సాధించాల్సిన అవసరం ఉందని సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.