ప్రెసిడెంట్ గిలానీ దోషి: తేల్చిన పాక్ సుప్రీం, 30సెకన్ల శిక్ష

గిలానీని జైలు శిక్ష నుంచి మినహాయించిన న్యాయమూర్తులు.. 63వ అధికారణం మేరకు తీర్పు ఇచ్చేందుకు అవకాశం ఉన్నా, దాని వల్ల గిలానీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో దాన్ని ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. జడ్జీలు నిష్క్రమించే వరకు లేదా కోర్టులో విచారణ ముగిసే వరకు శిక్ష విధిస్తున్నట్లుగా సుప్రీం జడ్జీలు తీర్పు ఇచ్చారు. ఆ వెంటనే కోర్టు నిష్క్రమించింది. దీంతో గిలానీ శిక్ష ముగిసినట్లయింది. విచారణ ప్రక్రియ మొత్తం పది నిమిషాల్లోనే పూర్తయింది.
శిక్ష స్వల్పమైనదే అయినప్పటికీ గిలానీ ప్రధానిగా కొనసాగడంపై, ఆయన పార్లమెంటు సభ్యత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాక్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టులో దోషిగా తేలితే ప్రధాని పదవికి అనర్హుడు. దీంతో ఇప్పుడు ఆయన పదవిపై చర్చ ప్రారంభమైంది. ఆయన ప్రధాని పదవికి అనర్హుడని విపక్షాలు మండిపడుతున్నాయి.
అయితే పాక్ మంత్రివర్గం మాత్రం ఆయనకు బాసటగా నిలిచింది. ఇది కేవలం కోర్టు ధిక్కారణ కేసు కాబట్టి దీనికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. గిలానీకి విధించిన శిక్షపై అప్పీల్కు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) అధినేత నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్(పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్లు గిలానీ గద్దె దిగవల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications