ఎయిరిండియా పైలట్ల మెరుపు సమ్మె, మంత్రి హెచ్చరిక

ఈ సమ్మెలో మంగళవారం ఉదయం వరకు సుమారు 250 మంది పైలట్లు పాల్గొన్నారని తెలుస్తోంది. కాగా సమ్మె చేస్తున్న పైలట్లు సాయంత్రం ఆరు గంటల లోగా విధులకు హాజరు కావాలని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వారు సమ్మెకు దిగారని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
పలు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైలట్లు ఎండాకాలంలో అదీ హాలీడేస్ వీకెండ్స్లో ఒక్కసారిగా సమ్మెకు దిగారు. బోయింగ్ 787 డ్రీమ్ లైన్ ట్రెయినింగ్ ఇష్యూ తేలక పోవడంతో పైలట్లు సమ్మెకు దిగారు.
సోమవారం రాత్రి ఈ అంశంపై విమానయాన సంస్థతో పైలట్లు చర్చించారు. చర్చలు విఫలమైన కొద్ది సమయంలోనే వారు సమ్మె బాట పట్టారు. కాగా కేంద్ర విమానయాన మంత్రి కూడా పైలట్లను హెచ్చరించారు. సాయంత్రం లోగా విధులకు హాజరు కావాలని సూచించారు.












Click it and Unblock the Notifications