వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయలార్‌తో చిరంజీవి:కూతురింట్లో ఐటి దాడులపై చర్చ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi-Chiranjeevi
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వాయలార్ రవితో రాజ్యసభ సభ్యుడు, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి మంగళవారం భేటీ అయ్యారు. రవితో చిరంజీవి దాదాపు పది నిమిషాలు మంతనాలు జరిపారు. ఈ భేటీలో చెన్నైలోని తన వియ్యంకుడి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

కాగా బుధవారం వాయలార్ రవి రాష్ట్రానికి రానున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెసు పార్టీ నేతలతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది. ఆయన మూడు రోజుల పాటు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితలతో కలిసి ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

రవి ప్రచార షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 17న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో, 18న అనంతపురంలో, 19న గుంటూరులో వాయలార్ రవి ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. ప్రచార సమయంలోనే ఆయన ఆయా నియోజకవర్గ నేతలతో సమీక్షలు జరపనున్నారు. ఉప ఎన్నికలలో గెలుపు వ్యూహాలపై వారితో చర్చించనున్నారు.

ఉప ఎన్నికల ప్రచారానికి వాయలార్ రవిని తాము ఆహ్వానించినట్లు బొత్స సత్యనారాయణ హైదరాబాదులో చెప్పారు. కాగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన వాయలార్ రవి రాష్ట్ర నేతల నుండి అభిప్రాయాలు సేకరించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేసిన విషయం తెలిసిందే.

English summary
Rajya Sabha Member Chiranjeevi met union minister Vayalar Ravi on tuesday in New Delhi. It seems, they talk about Bypolls and IT raids on Chiranjeevi's daughter residence. Vayalar Ravi is coming to Andhra Pradesh on wednesday for campaign in Bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X