ఐఐటి సాధించిన ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రూ. 50 వేలు

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా పది వేల రూపాయలు ఇచ్చేది. ఈసారి దాన్ని పెంచారు. నిరుడు ఇదే కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు ఐఐటి - జెఇఇలో ఆర్హత సాధించగా ఈ ఏడాది 18 మంది విద్యార్థినీ విద్యార్థలు అర్హత సాధించారు. మొత్తం 52 మంది విద్యార్థుల్లో 18 మంది ఐఐటికి అర్హత సాధించగా మిగిలినవారు ఎఐఇఇఇలో మంచి ఫలితాలు సాధిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.
ఐఐటి - జెఇఇలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి అభినందించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలు వారి కుటుంబ సభ్యులకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లిస్తోందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఐఐటి - జెఇఇలో అర్హత సాధించిన కళాశాలకు చెందిన 18 విద్యార్థినీ విద్యార్థులు్లో 17 మంది ఎస్సీలు కాగా, ఒకరు ఎస్టీ. వీరి తల్లిదండ్రులు కూలీలు, రైతులు, హమాలీలు, ఐకెపి వర్కర్, టైలర్, ఆటో డ్రైవర్ వంటి వృత్తులు చేస్తున్నారు. ఈ 18 మంది కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications