పెట్రో మంట: లీటరుకు రూ.7.50 పైసల పెంపు

ఢిల్లీలో ఇప్పటి వరకు పెట్రోలు ధర లీటరకు రూ.65.64 పైసలు ఉంది. ప్రస్తుత పెంపుతో అది రూ. 73.14 పైసలు అయింది. పెట్రోలు ధరను లీటరుకు కనీసం నాలుగు రూపాయలు పెంచాలని ఒత్తిడి తెస్తూ వస్తున్నాయి. అమెరికా డాలరుపై రూపాయి విలువ గణనీయంగా తగ్గిపోవడం వల్ల కూడా పెట్రోలు ధర పెంపు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. డాలర్కు రూపాయి విలువ రూ.55.95 పైసలకు పడిపోయింది.
పెట్రోలు ధర పెంపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పెట్రోలు ధర పెంపును వామపక్షాలు వ్యతిరేకించాయి. ప్రజలపై ఇది క్రూరమైన భారమని వ్యాఖ్యానించాయి. పెట్రోలు ధర పెంపు అనివార్యమైన మంగళవారం చెప్పిన జైపాల్ రెడ్డి ఎప్పుడు పెంచుతారు, ఏ మేరకు పెంచుతారనే విషయాన్ని వెల్లడించలేదు. రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత పెంచుతామని ఆయన అన్నారు. ఈలోగానే ధరను పెంచేశారు.
పెట్రోల్ ధర పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు మండిపడుతున్నారు. ఇంత దారుణంగా పెట్రోలు ధర పెంచడాన్ని వారు మింగలేకపోతున్నారు. ధర పెరుగుదల అమలుకు ఇంకా సమయం ఉండడంతో బుధవారం సాయంత్రం నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. కాగా, యుపిఎ భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ పెట్రోల్ ధర పెంపుపై తీవ్రంగా మండిపడ్డారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications