వారిని పంపించారు, వైయస్ జగన్ను విచారిస్తున్నారు

నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవిలతో కలిపి వైయస్ జగన్ను పావు గంట పాటు ప్రశ్నించారు. జగతిలో పెట్టుబడులు, వాన్పిక్ వ్యవహారాలపై వైయస్ జగన్ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్కు మధ్యాహ్నం లంచ్ కోసం అర గంట పాటు విరామం ఇచ్చారు. ఈ సమయంలో ఆయన ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారం భుజించారు.
విచారణకు వైయస్ జగన్ సహకరించడం లేదని అంటున్నారు. సాయంత్రం విడిగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణ వైయస్ జగన్ను విచారిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకే నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను విచారించాలని కోర్టు ఆదేశాలు ఉండడంతో వైయస్ జగన్ విచారణ కూడా ఈ రోజుకి ముగుస్తుందని భావించారు. కానీ, ఆ తర్వాత కూడా విచారణ కొనసాగుతోంది. ఉదయం పదిన్నరకు మొదలైన జగన్ విచారణ, సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా కొనసాగుతోంది.
సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడి అధికారులు వైయస్ జగన్ను ప్రశ్నిస్తున్నారు. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే జగతి పబ్లికేషన్స్ హెడ్ను రప్పించి పెట్టుబడులపై సిబిఐ అధికారులు ప్రశ్నించారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన 15 కంపెనీలపై సిబిఐ అధికారులు పదే పదే జగన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల చిరునామాలు ఏమిటి, వాటికి పెట్టుబడులు ఎలా వచ్చాయి, సండూరు పెట్టుబడులు అమాంతం ఎలా పెరిగాయి వంటి ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications