భారత్ బంద్: దక్షిణాదిన పాక్షికం, ఉత్తరాన ప్రభావం

చాలాచోట్ల ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద సిపిఎం నేత మధు ఆందోళనకు దిగారు. ఈ బస్ స్టేషన్ నుండి రోజుకు 3600 బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. సిపిఎం ఆందోళన కారణంగా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లలేదు. ధర్నా చేస్తున్న మధుతో సహా పలువుకు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మహబూబ్నగర్, అదిలాబాద్ తదితర జిల్లాలలో డిపోల వద్ద బైఠాయించిన వివిధ పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదిలాబాదులో ధర్నా కారణంగా ఐదు డిపోలలోని 596 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బందులో పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడంలో ఆందోళనకారులు ఓ ఆర్టీసి బస్సును ధ్వంసం చేశారు.
హైదరాబాదులో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల పెట్రోల్ బంకులను మూసివేశారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే యాభై బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు ఆర్టీసి అధికారులు చెప్పారు. నగరంలో లోకల్ బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆబిడ్స్లో ధర్నాలో పాల్గొన్నారు. ఎంజిబిఎస్ ధర్నాలో పాల్గొన్న మధు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుమంగా వేతనాలు పెరగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఒక్కసారిగా దాదాపు ఎనిమిది రూపాయలు పెట్రోలు ధర పెంచడంతో అందరు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాగే అయితే గ్యాస్ బండను రూ.ఎనిమిది వందలు చేస్తారన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు లొంగి పెట్రోలు ధరలు పెంచారని ఆయన ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వం మట్టి కొట్టుకు పోతుందన్నారు. కాంగ్రెసు మినహా రాజకీయ పార్టీలు అన్నీ బందును జయప్రదం చేసేందుకు పిలుపునిచ్చాయన్నారు.
దక్షిణ భారత దేశంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో బంద్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఉత్తర భారత దేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముంబయి, లక్నో, పాట్నాలలో శివసేన, బిజెపి, బిజెడి కార్యకర్తలు రోడ్ల పైకి, రైలు పట్టాల పైకి వచ్చి వాహనాలను, రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications