Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ బంద్: దక్షిణాదిన పాక్షికం, ఉత్తరాన ప్రభావం

Bharat Bandh
న్యూఢిల్లీ/హైదరాబాద్: పెట్రోల్ ధరలు నిరసిస్తూ కాంగ్రెసేతర పార్టీలు చేపట్టిన బంద్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని జిలాల్లలో ఆర్టీసి డిపోల ఎదుట తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

చాలాచోట్ల ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద సిపిఎం నేత మధు ఆందోళనకు దిగారు. ఈ బస్ స్టేషన్ నుండి రోజుకు 3600 బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. సిపిఎం ఆందోళన కారణంగా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లలేదు. ధర్నా చేస్తున్న మధుతో సహా పలువుకు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మహబూబ్‌నగర్, అదిలాబాద్ తదితర జిల్లాలలో డిపోల వద్ద బైఠాయించిన వివిధ పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదిలాబాదులో ధర్నా కారణంగా ఐదు డిపోలలోని 596 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బందులో పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడంలో ఆందోళనకారులు ఓ ఆర్టీసి బస్సును ధ్వంసం చేశారు.

హైదరాబాదులో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల పెట్రోల్ బంకులను మూసివేశారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే యాభై బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు ఆర్టీసి అధికారులు చెప్పారు. నగరంలో లోకల్ బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆబిడ్స్‌లో ధర్నాలో పాల్గొన్నారు. ఎంజిబిఎస్ ధర్నాలో పాల్గొన్న మధు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుమంగా వేతనాలు పెరగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ఒక్కసారిగా దాదాపు ఎనిమిది రూపాయలు పెట్రోలు ధర పెంచడంతో అందరు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాగే అయితే గ్యాస్ బండను రూ.ఎనిమిది వందలు చేస్తారన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు లొంగి పెట్రోలు ధరలు పెంచారని ఆయన ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వం మట్టి కొట్టుకు పోతుందన్నారు. కాంగ్రెసు మినహా రాజకీయ పార్టీలు అన్నీ బందును జయప్రదం చేసేందుకు పిలుపునిచ్చాయన్నారు.

దక్షిణ భారత దేశంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో బంద్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఉత్తర భారత దేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముంబయి, లక్నో, పాట్నాలలో శివసేన, బిజెపి, బిజెడి కార్యకర్తలు రోడ్ల పైకి, రైలు పట్టాల పైకి వచ్చి వాహనాలను, రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+