UPSC లోనూ అక్రమాలా ? గ్రూప్ 1 చర్చ వేళ విజయసాయిరెడ్డి ట్వీట్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష (APPSC Group 1) మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ రిపోర్ట్ కలకలం రేపుతున్న వేళ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్ని ప్రశ్నిస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ ట్వీట్ చేశారు. తాజాగా బయటపడిన యూపీఎస్సీ పరీక్ష అక్రమాలను ఆయన ఇందులో ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి, సమగ్రంగా నియామక సంస్కరణలు తీసుకురావాలని సాయిరెడ్డి కోరారు.
ప్రభుత్వ నియామక పరీక్షలలో అవకతవకలపై పదేపదే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, దివ్యాంగుల కోటాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలకు సంబంధించిన ఇటీవలి కేసులు, యూపీఎస్సీ వ్యవస్థపై కూడా మరింత పటిష్టమైన పరిశీలన అవసరమని స్పష్టం చేశాయని సాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి సమస్యలు మరింత విస్తృతంగా, నిరంతరంగా కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రతిభను తక్కువ చేసి చూసినప్పుడు, రిజర్వేషన్ ప్రయోజనాలు అర్హులైన వారికి చేరనప్పుడు, నియామక వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు.

1/2: Concerns have repeatedly been raised about irregularities in government recruitment examinations. Recent cases involving the alleged misuse of disability and EWS quotas have shown that even the UPSC system requires stronger scrutiny. At the state level, such problems appear…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 15, 2026
అలాగే పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం నుండి అర్హత, రిజర్వేషన్ల క్లెయిమ్లను ధృవీకరించడం వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో భారతదేశానికి సమగ్ర నియామక సంస్కరణలు అవసరమని సాయిరెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇది స్వాతంత్ర్యదినోత్సవ ప్రతిజ్ఞగా మారాలన్నారు. పటిష్టమైన భారతదేశ నిర్మాణానికి స్వచ్ఛమైన, విశ్వసనీయమైన, ప్రతిభ ఆధారిత నియామక వ్యవస్థ అత్యవసరమని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications