స్వతంత్ర ఎమ్మెల్యేపై దుండగుల కాల్పులు

భరత్ సింగ్ ఎంసిడి కౌన్సిలర్, గ్యాంగ్స్టర్ కిషన్ పెహల్వాన్ సోదరుడు. ఇతనిపై పలు కేసులున్నాయి. దారిన వెళ్తున్న ఓ వ్యక్తి కూడా ఈ సంఘటనలో గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ఎమ్మెల్యేపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
దాడి చేసిన ఐదుగురిలో నలుగురు వ్యక్తులు శాసనసభ్యుడిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. శానససభ్యుడిని గాయపడిన వ్యక్తిని సమీపంలోని మాతా చనన్ దేవి ఆస్పత్రిలో చేర్చారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు. సంఘటనలో గాయపడిన వ్యక్తిని ధర్మపాల్గా గుర్తించారు.












Click it and Unblock the Notifications