షర్మిలకు కౌంటర్: అనిల్ బయ్యారం గనుల ఇష్యూ
జగన్ సతీమణి భారతి కూడా షర్మిలను వైయస్ విజయమ్మ తోడు తీసుకోవడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైయస్ రాజశేఖర రెడ్డి కూడా కూతురు షర్మిలకు, అల్లుడు అనిల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని అంటారు. వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్కు చెందినదిగా ఆరోపణలున్న బయ్యారం గనులు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఆ గనులతో తనకు ఎలాంటి సంబంధం లేదని అనిల్ ఖండించారు.
షర్మిలకు ప్రచారం సందర్భంగా జనంలో ఇమేజ్ పెరుగుతోంది. ఆమె కొద్దిసేపు మాత్రమే మాట్లాడుతున్నప్పటికీ, షర్మిళ ప్రసంగానికి విజయమ్మ కన్నా ఎక్కువ స్పందన కనిపిస్తుండటం గమనార్హం. ‘సోనియా గాంధీ గారు మా తండ్రిని పెద్ద లీడరు చేశారంటున్నారు. అదే నిజమయితే కిరణ్కుమార్రెడ్డిని అంత లీడర్గా ఎందుకు తయారు చేయలేక పోయింది’పంచ్ డైలాగులను షర్మిల విసురుతున్నారు. పార్టీ గుర్తు ఫ్యానును స్వయంగా తిప్పుతూ, జగనన్నను సీఎం చేయాలని పిలుపునిస్తున్నారు. వైయస్ జగన్ అరెస్టయిన తర్వాత షర్మిల లీడ్ తీసుకుని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు.
జగన్ సతీమణి భారతి హైదరాబాదులో న్యాయవాదులను సమన్వయం చేసుకోవడం, జగన్తో మాట్లాడటం, కీలక వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆమె ప్రచారానికి వెళ్లలేదని చెబుతున్నారు. అనూహ్యంగా షర్మిల రాజకీయ వర్గాల్లో ప్రధాన పాత్రగా మారిపోయారు. ప్రత్యర్థులు విస్మరించలేని స్థితికి ఆమె చేరుకున్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ఆమె ఆరోపణలను ఆయన ఖండించారు. దీంతో ప్రధాన రాజకీయ నేతల శ్రేణిలో ఆమె చేరిపోయారనే ప్రచారం జరుగుతోంది.