ప్రేమ పెళ్లి, ఇంటిపై దాడి: ఎన్‌కౌంటర్లో రౌడీషీటర్ మృతి

Karimnagar
నల్గొండ/కరీంనగర్: జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దంపతులపై వ్యక్తిగత కక్షలతో ప్రత్యర్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఓ అమ్మాయి, అబ్బాయి వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీ సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిపై అర్ధరాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో అబ్బాయి తండ్రి మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్ సుధీర్ మృతి చెందాడు. పట్టణంలోని పవర్ హౌస్ కాలనీకి చెందిన సుధీర్ కరీంనగర్, గోదావరిఖనిలో జరిగిన రెండు హత్య కేసులలో నిందితుడు. ఇటీవల సప్తగిరి కాలనీలో చికెన్ వ్యాపారిపై దాడి చేయడంతో పాటు సుధీర్ గ్యాంగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామను సుధీర్ రాజేష్ థియేటర్ సమీపంలో ఉన్నట్లుగా తెలుకుసున్న పోలీసులు అక్కడకు వెళ్లారు.

పోలీసులను గమనించిన వెంటనే సుధీర్ తన వద్ద ఉన్న తపంచాతో కాల్పులు జరిపాడు. పారిపోయేందుకు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పోలీసులు మృతదేహం వద్ద తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలిని డిఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన అనసూయ తెరాస బహిరంగ సభకు హాజరై ఆటోలో తిరిగి ఇంటికి వస్తుండగా ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు మహిళలను ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+