రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, జగన్ పార్టీ: ఉద్రిక్త పరిస్థితి

దీంతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త వేడెక్కింది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. బూత్ వద్దే బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉప ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ వడదెబ్బతో మృతి చెందాడు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో రికార్డ్ స్థాయిలో మధ్యాహ్నం లోపే పోలింగ్ నమోదు అయింది. రుద్రవరం మండలంలోని కొత్తవెలగపల్లిలో లంచ్ లోపే 90 శాతం పోలింగ్ పూర్తయింది. గ్రామంలో ఉన్న 221 మంది ఓటర్లలో 203 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కడప జిల్లా రాజంపేటలో డబ్బు పంచుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జానకి రామయ్య, సుబ్బారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరంలో కాంగ్రెసు నేత శివప్పగౌడ్ను పాస్ లేకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నేత ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైల్వేకోడూరులో అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications