వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప పోరు: చంద్రబాబుకు షాక్, సైకిల్ పంక్చర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఉప ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. తెలంగాణలోని పరకాలలో మాత్రమే కాస్తా ఫరవా లేదనిపిస్తోంది. పరకాలలో రెండో స్థానంలో కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, కాంగ్రెసుకు మధ్యనే సీమాంధ్రలో పోటీ నెలకొని ఉంది. మొదట ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అయితే, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు.

రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి వంటి స్థానాల్లో కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు గట్టి పోటీ ఇస్తోంది. రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొని ఉంది.

తెలంగాణలోని పరకాల శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. తెరాసకు సవాల్ విసిరి బరిలోకి దిగిన బిజెపి నాలుగో స్థానంలో ఉంది.

నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై 11 వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉదయగిరి శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కేవలం 405 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. నర్సాపురం, తిరుపతి స్థానాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుంది.

ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెసు పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నర్సాపురం, తిరుపతి నియోజకవర్గాల్లో కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే, తిరుపతిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. రెండో రౌండులో వెంకటరమణ 59 ఓట్ల మెజారిటీ సాధించారు.

కాగా, పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది. చాలా చోట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్యనే పోరు కొనసాగుతోంది. ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగి రెడ్డి ఆధిక్యంలో ఉంది. రాయదుర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు ఆధిక్యంలో ఉంది.

ఎమ్మిగనూరు, రాజయంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పోలవరం, పాయకరావుపేట, మాచర్ల, ప్రత్తిపాడు, రామచంద్రాపురం తదితర నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.

English summary
TDP is lead in one seat at Ongole.TRS leading in Parkal. YSR Congress is leading in 15 seats. Congress is leading at Narasapur and Tirupathi, Counting of votes polling held for 18 assembly seats and Nellore Loksabha seat on Jube 12, has began today morning. Arrangements were made by EC for counting of votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X