పరకాలలో టెన్షన్ పెట్టిన కొండా సురేఖ, గట్టెక్కిన తెరాస
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉదయగిరి శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి విజయం సాధించారు. తిరుపతి స్థానంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుంది.
ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14 స్థానాలు గెలుచుకుని ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది, కాంగ్రెసు పార్టీ రెండు స్థానాల్లో గెలిచింది. అయితే, తిరుపతిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. రెండో రౌండులో వెంకటరమణ 59 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగి రెడ్డి గెలిచారు. రాయదుర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు గెలిచింది.
ఎమ్మిగనూరు, రాజయంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పోలవరం, పాయకరావుపేట, మాచర్ల, ప్రత్తిపాడు, రామచంద్రాపురం తదితర నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.