వైయస్ మోసం: శంకరన్న, భూపందేరాలు: విహెచ్

ఆరుగురు మంత్రుల్లో బలహీనవర్గాలకు చెందిన యువనాయకుడు మోపిదేవి వెంకటరమణను మాత్రమే అరెస్టు చేశారని, మిగతావాళ్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను నోటీసులు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పద్ధతి వల్ల కాంగ్రెసుకు బలహీన సామాజిక వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. బయట ఉన్న మంత్రులను సిబిఐ విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు విమర్శించారు. కొందరు కడపవాసులు, మిగతా అధికారులు హైదరాబాదును దోచుకున్నారని ఆయన మంగళవారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వ న్యాయవాదులు ప్రైవేట్ వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు.
2002 నుంచి జరిపిన పట్టమ భూక్రమబద్దీకరణలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులోని అంబర్పేటలో పాఠశాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ఈ ప్రాంత భూముల సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడుతానని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications