Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారుణం: కుప్పగా పసికందుల మృతదేహాలు లభ్యం

Mahaboob Nagar Map
మహబూబ్‌నగర్: జిల్లాలో దారుణం వెలుగు చూసింది. పెద్దచెరువుగట్టు ప్రాంతంలో శుక్రవారం ఉదయం తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయి. అవన్నీ చిన్న పిల్లల మృతదేహాలు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించింది. తొలుత ఆరుమృతదేహాలు కనిపించాయి. ఆ తర్వాత ఇరవైకి పైగా పసికందుల మృతదేహాలను గుర్తించారు. అవన్నీ మగ శిశువులుగా వైద్యశాఖ గుర్తించినట్లుగా తెలుస్తోంది.

మృతదేహాల ఘటనకు ఖచ్చితంగా కారణాలు తెలియరాలేదు. అయితే ప్రయోగాల నిమిత్తం వైద్యులు వాడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని ఆసుపత్రుల నుండి తీసుకు వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయివేటు మెడికల్ కళాశాలలో విద్యార్థుల పరీక్షల కోసం కూడా తెచ్చి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనే కోణంలో దృష్టి సారించారు. ఒకేసారి ఇన్ని మృతదేహాలు బయట పడటంతో పోలీసు శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. అన్ని శరీరాలు గడ్డకట్టుకొని ఉండటంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రెండు వారాల క్రితం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బలవంతపు అబార్షన్ల కోణంలోనూ దృష్టి సారిస్తున్నారు.

మృతదేహాల ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసు, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. కాగా ప్రయివేటు ఆసుపత్రుల వద్ద గట్టి నిఘా పెడతామని జిల్లా డిఎస్పీ హిమవతి చెప్పారు. కాగా గతంలో సరూర్ నగర్ చెరువులో ఏడు మృతదేహాలు లభ్యమవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+