దారుణం: కుప్పగా పసికందుల మృతదేహాలు లభ్యం

మృతదేహాల ఘటనకు ఖచ్చితంగా కారణాలు తెలియరాలేదు. అయితే ప్రయోగాల నిమిత్తం వైద్యులు వాడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని ఆసుపత్రుల నుండి తీసుకు వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయివేటు మెడికల్ కళాశాలలో విద్యార్థుల పరీక్షల కోసం కూడా తెచ్చి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనే కోణంలో దృష్టి సారించారు. ఒకేసారి ఇన్ని మృతదేహాలు బయట పడటంతో పోలీసు శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. అన్ని శరీరాలు గడ్డకట్టుకొని ఉండటంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రెండు వారాల క్రితం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బలవంతపు అబార్షన్ల కోణంలోనూ దృష్టి సారిస్తున్నారు.
మృతదేహాల ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసు, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. కాగా ప్రయివేటు ఆసుపత్రుల వద్ద గట్టి నిఘా పెడతామని జిల్లా డిఎస్పీ హిమవతి చెప్పారు. కాగా గతంలో సరూర్ నగర్ చెరువులో ఏడు మృతదేహాలు లభ్యమవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications