గాలి బెయిల్: యాదగిరి అరెస్ట్, 2.25 కోట్లు స్వాధీనం

ఎసిబి అధికారులు యాదగిరిని రహస్య ప్రదేశంలో ఉండి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన నుండి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన నుండి సేకరించిన వివరాలతో మరికొందరి అరెస్టులకు ఎసిబి రంగం సిద్ధం చేసే అవకాశముందని అంటున్నారు. హైదరాబాదులోని పలు ప్రాంతాలలో కూడా యాదగిరి చెప్పిన వివరాల ప్రకారం సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది.
కాగా గాలి బెయిల్ స్కాం కేసులో తాజాగా ప్రభాకర రావు అనే జడ్జి పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. గాలి జనార్దన రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జ్యుడీషియల్ ఆఫీసర్ (జిల్లా జడ్జి హోదా)గా పని చేస్తున్న ప్రభాకర్ రావు కూడా బేరం పెట్టినట్లు తేలింది. ఎసిబి అధికారులు అరెస్టు చేసిన పట్టాభిరామా రావు కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జి చలపతిరావుల నేరాంగీకార పత్రంలో... బెయిల్ స్కామ్ గురించిన పూర్తి వివరాలు పూసగుచ్చినట్లున్నాయి.
ఇప్పటికే ఎసిబి అధికారులు పట్టాభిరామ రావును, ఆయన తనయుడు రవిచంద్రను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పట్టాభి రామారావును కోర్టు రెండు రోజుల ఎసిబి కస్టడీకి అప్పగించింది. ఎసిపి ఈ బెయిల్ విషయంలో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తోంది. వారి వాంగ్మూలాలు తీసుకుంటోంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications