బెంగళూర్లో భాను కిరణ్కు హోటల్, రియల్ ఎస్టేట్
అక్రమంగా వచ్చిన డబ్బులతో అతను సిమెంట్ కంపెనీ డీలర్షిప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బలవంతపు వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బుతో భాను కిరణ్ బెంగళూర్లో హోటల్ పెట్టాడని, ఐదు ఎకరాల భూమిని కొన్నాడని, సిమెంట్ ఏజెన్సీని స్థాపించడానికి అధికారులు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
భాను కిరణ్ ఆస్తులను అమ్మకుండా గుర్తించినవాటిని అధికారులు స్తంభింపజేయాలని చూస్తున్నారు. భాను కిరణ్ తీసుకున్న భూమి విలువ ఎకరానికి ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. కొన్ని ఆస్తులను భాను కిరణ్ తన బినామీ అయిన వంశీ పేరు మీద రిజిష్టర్ చేసినట్లు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు.
భాను కిరణ్, మంగలి కృష్ణ జ్యుడిషియల్ రిమాండ్ను నాంపల్లి కోర్టు బుధవారం ఈ నెల 18వ తేదీ వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భాను కిరణ్, మంగలి కృష్ణలను సిఐడి అధికారులు ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే.