వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు కితాబు: సోనియాకు ప్రశంసలతో లేఖ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijay Babu
హైదరాబాద్: సమాచార హక్కు కమిషనర్‌గా నియమితులైన ఆంధ్రప్రభ మాజీ సంపాదకులు విజయ్ బాబు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. ఈ లేఖను ఆయన కమిషనర్‌గా నియామకం కాకముందు రాశారు. పదవి కోసమే ఆ లేఖ రాశారంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ తెలుగు ఛానల్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఆ లేఖలో ఆయన సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కితాబు ఇచ్చారు. తన డైనమిక్ సిద్ధాంతాలకు పదును పెడతానని
చెప్పారు.

నిస్వార్థతకు నిలువెత్తు రూపమైన సోనియాకు మరింత పేరు తీసుకు వస్తానని చెప్పారు. తెలుగు ప్రజలకు తాను సేవ చేసే తరుణం ఆసన్నమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆలోచనలలో ఆలోచనగా పని చేస్తానని చెప్పారు. తన గురించి పెద్దగా పదాలు అవసరం లేదని లేఖలో రాశారట.

నిష్పక్షపాత సంపాదకుడిగా తాను పని చేశానని చెప్పారు. సంపాదకుడిగా, రచయితగా, వక్తగా సేవలు చేశానని చెప్పారు. తెలుగు భాషాభివృద్ధిలో భాగంగా విదేశాలకు వెళ్లానని చెప్పారు. వందల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చానని తెలిపారు. కాగా ఇటీవల విజయ్ బాబు సమాచార హక్కు కమిషనర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.

English summary
Right to Information Commissioner Vijay Babu wrote a 
 
 letter to AICC president Sonia Gandhi, he praised 
 
 her and chief minister Kiran Kumar Reddy in his 
 
 letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X