కెసిఆర్ మాటలకు విలువ లేదు: రేణుకా చౌదరి

తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం ఉందని, తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణపై ఏదో ఒక రోజు నిర్ణయం ప్రకటించాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగడానికి తనకు మాత్రమే వీసా ఉందని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పర్యటించడానికి తనకు వీసా ఉందని ఆమె అన్నారు. తెలంగాణపై కెసిఆర్ ప్రకటనతో తమ పార్టీకి సంబంధం లేదని ఆమె అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికతో తమ పార్టీ నాయకత్వం తీరిక లేకుండా ఉందని, రాష్ట్రపతి ఎన్నిక తర్వాతనే తెలంగాణపై ఆలోచన చేస్తుందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతోందనేది ఊహాగానాలు మాత్రమేనని ఆమె అన్నారు. రాష్ట్రానికి చెందిన నాయకులతో తమ పార్టీ నేత రాహుల్ గాంధీ సమావేశం కావడంలో విశేషం ఏమీ లేదని, రాష్ట్ర నాయకులు రాహుల్ గాంధీని కలుసుకోవడం మామూలేనని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పరిస్థితులపై అభిప్రాయాలు సేకరిస్తున్నారని ఆమె చెప్పారు.
తెలంగాణపై భాగస్వామ్య పక్షాలతోనూ చర్చలు జరుపుతున్నట్లు రేణుకా చౌదరి చెప్పారు. వివిధ సంస్థల ద్వారా కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు ఆమె తెలిపారు
కాంగ్రెసు నేత రాహుల్ గాంధీని హైదరాబాద్ మాజీ మేయర్ బండారు కార్తీకరెడ్డి బుధవారం ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ - రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ దృష్టి పెట్టారని, త్వరలోనే ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారని కార్తీకరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications