పడవపై అమెరికా కాల్పులు, తమిళనాడువాసి మృతి

Tamilnadu Map
దుబాయ్: అమెరికా సేనల కాల్పులకు తమిళనాడుకు చెందిన జాలరి బలయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. గల్ఫ్ సముద్ర జలాల్లో ఈ సంఘటన జరిగింది. దుబాయ్‌కి చెందిన ఓ చేపలు పట్టే సంస్థ పడవపై అమెరికా నౌకా దళ సిబ్బంది కాల్పులు జరిపారు. పడవలో రోజువారీ కూలీకి పని చేస్తున్న ముగ్గురు తమిళులు, మరో ఇద్దరు యూఏఈ జాతీయులు ఉన్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన వ్యక్తి మరణించారు. మరో ఇద్దరు భారతీయులు, ఒక యూఏఈ జాతీయుడు కూడా గాయపడ్డారు.

చేపల వేటకు వెళ్లిన బోటు సిబ్బంది తాము పదేపదే హెచ్చరిస్తున్నా వినకుండా తమ నౌకవైపు దూసుకు రావడంతో మెషిన్‌గన్‌తో కాల్పులు జరిపినట్లు అమెరికా నౌకాదళ ప్రతినిధి రేల్సన్ ప్రకటించారు. అయితే ఈ పడవను ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ పడవగా భావించి కాల్పులు జరిపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ పడవ ఇరాన్ నౌకాదళం ఉపయోగించే పడవనే పోలి ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగిందని అంటున్నారు.

గల్ఫ్ జలాలలో గతంలో కూడా అమెరికా నౌకాదళం, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనేకసార్లు తలపడ్డాయి. ఈ సంఘటనపై విచారణ జరుపుతామని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. మరణించిన జాలరిని తమళనాడులోని రామనాథపురం జిల్లా పెరియపట్టణం నివాసి శేఖర్‌గా గుర్తించినట్లు కరైయూర్ జాలర్ల సంఘం అధ్యక్షుడు మలైరాజన్ చెప్పారు.

గాయపడిన మునిరాజ్, పన్‌పువన్, మురగన్ కూడా రామనాథపురం జిల్లాకు చెందినవారేనని ఆయన చెప్పారు. బుల్లెట్ గాయాలతో మునిరాజ్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. రామనాథపురం జిల్లాకు చెందిన జాలర్లలు దుబాయ్ ఫిషింగ్ కంపెనీల్లో దినసరి వేతనంపై పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+