హైదరాబాదులో గౌహతి తరహా దాష్టీకం, టీజింగ్?
పాఠశాలకు వెళ్లే సమయంలో, పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో గత 15 రోజులుగా తనను ముగ్గురు పోకిరీలు వేధిస్తున్నారని అమ్మాయి పోలీసులకు చెప్పింది. తనను టీజ్ చేస్తున్న యువకుల విషయాన్ని అమ్మాయి బుధవారం సాయంత్రం తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమ్మాయిని వేధిస్తున్న ముగ్గురు యువకుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. వారిని సాయంత్రంలోగా పట్టుకుంటామని వారు చెబుతున్నారు. ఆ యువకుల తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు మాట్లాడారు. పోకిరీలు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఈ అమ్మాయి ఒంటరిగా పాఠశాలకు వెళ్లడం, తిరిగి వస్తుండడం చూసి పోకిరీలు ఆమె వెంట పడినట్లు భావిస్తున్నారు.
గౌహతిలో ఓ అమ్మాయిని పోకిరీలు వేధించిన సంఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓ అమ్మాయిని నడి బజార్లో రేప్ చేయబోయారు. దాన్ని ఓ టీవీ జర్నలిస్టు రికార్డు చేశారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది.