విజయమ్మ ధర్నాకు అనుమతిపై పరిశీలించండి: హైకోర్టు
పిటిషన్లో కరీంనగర్ జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిరిసిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒకరోజు ధర్నాచేయడానికి తమ పార్టీ పిలుపు నిచ్చిందని, ఈ కార్యక్రమానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజరువుతున్నారని పిటిషన్లో తెలిపారు.
ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ శాంతి యుతంగా ధర్నా చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ధర్నాకు అనుమతించాలని కోరుతూ ఈనెల 13న స్థానిక పోలీసులకు దరఖాస్తు చేస్తే నిరాకరించినట్లు తెలిపారు.
ప్రతిపక్ష పార్టీ నిరసన కార్యక్రమానికి అనుమతించక పోవడం అన్యామని, ప్రతిపక్షాల గొంతునొక్కాలని చూస్టున్నారని, ఇది ప్రజాస్వామ్య విధానం కాదని పిటిషన్లో అన్నారు. ఈ నెల 23న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన 'నేతన్న ధర్నా' కు అనుమతించాలని పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.